అవన్నీ కాంగ్రెస్ ప్రాజెక్టులే: పొన్నం

4 May, 2016 12:35 IST|Sakshi

కరీంనగర్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు.కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఒక్క మెదక్ జిల్లాను తప్ప మిగిలిన ఏ జిల్లాను కూడా పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల పాలనలో కరీంనగర్ జిల్లాకు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకుండా కేవలం తన మార్కు చూపించాలని తాపత్రయపడుతున్నారని అన్నారు.

 

మరిన్ని వార్తలు