ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే : మల్లు రవి

22 Jul, 2016 15:50 IST|Sakshi
ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే : మల్లు రవి
హైదరాబాద్‌ : మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు. ఈ ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిదిలా మారిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ​ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వాయిదా పడినట్లు మల్లు రవి తెలిపారు.
మరిన్ని వార్తలు