‘ప్రజల్లో చైతన్యం తేవడమే యాత్ర లక్ష్యం..’

20 Feb, 2018 15:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ  ఈ నెల 26 నుంచి 29వరకు ప్రజా చైతన్య యాత్రను చేపట్టనుంది. కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా ఉన్న చేవేళ్ల నుంచే ఈ బస్సు యాత్ర  ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. ఈ యాత్రలో ఏఐసీసీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర తెలంగాణలో మూడు రోజులపాటు జరగనుంది. బస్సు యాత్రలో  మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యలు పాల్గొననున్నారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశ, నియంతృత్వ విధానాలను తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాక అధికార నియంతృత్వంపై ప్రజల్లో చైతన్యం తేవడమే  యాత్ర లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు