సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నేడు 13 మందిని డిశ్చార్జ్ చేసినట్టు తెలిపింది. ఇదివరకే డిశ్చార్జ్ అయిన వ్యక్తితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 14 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు చెప్పింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 61 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.