సనత్‌నగర్‌లో దంపతుల వీరంగం

19 Feb, 2020 10:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌నగర్‌లో దంపతులు వీరంగం సృష్టించారు. ఓ పాఠశాల విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. రోడ్డుపై గోల చేస్తున్నాడంటూ అతడిని చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక సదరు చిన్నారి.. వారి కాళ్లపై పడ్డా కనికరించకుండా.. కర్కశంగా వ్యవహరించారు. లేబర్‌గాళ్లంటూ అతడిని దూషిస్తూ.. దాడికి దిగారు. అనంతరం వారే పోలీసుస్టేషనుకు వెళ్లి విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థిని కొట్టిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు