గుప్త నిధుల కోసం తవ్వకాలు

20 Aug, 2015 18:36 IST|Sakshi

వేమనపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది.

అయితే బుధవారం రాత్రి కొంతమంది దుండగులు ఈ ఆలయంలో చోరబడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు