చేపల చెరువులో విషం

7 Sep, 2017 13:04 IST|Sakshi
- భారీగా నష్టం
 
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాలలో దారుణం వెలుగుచూసింది. గ్రామ శివారులోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు రసాయన పదార్థాలు కలిపారు. దీంతో చెరువులోని చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు కోటి రూపాయల విలువైన చేపలు మృతి చెందినట్లు మత్యకారులు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదంటూ వారు వాపోతున్నారు. 
మరిన్ని వార్తలు