రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

15 Mar, 2016 03:32 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి

వనపర్తి టౌన్ : రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆరోపించారు. సోమవారం వనపర్తి పట్టణంలో వనపర్తి, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల కోర్ కమిటీసభ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. వెనకబడిన పాలమూరు జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చే యకుండా కొత్త ప్రాజెక్టులను తీసుకరావడం సరికాదన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, శ్రీవర్దన్‌రెడ్డి, బి. కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకులు ఆర్. వెంకటేశ్వర్‌రెడ్డి, డి. నారాయణ, కుమార్, కుమారస్వామి, శ్రీశైలం, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు