గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు 

11 Jun, 2018 02:32 IST|Sakshi

హైదరాబాద్‌: గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు