వజ్రాలు పెట్టి కొన్నా..

4 Jul, 2015 13:19 IST|Sakshi
వజ్రాలు పెట్టి కొన్నా..

హైదరాబాద్: నేనెక్కడికి పోయినా సిద్ధిపేటను మాత్రం మరిచిపోలేనని... ఇక్కడివారి స్ఫూర్తితోనే ఇంతవాడినయ్యానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా సిద్ధిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం కేసీఆర్ సిద్ధిపేట ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వజ్రాలు పెట్టి కొనుకున్నా సొంత ఊరు ప్రేమ మాత్రం దొరకదని... సిద్ధిపేట నర్సరీలో మొలచిన మొక్కను తానని అన్నారు.

దీంతో హరితహారంలో పాల్గొన్న ప్రజలు కరతాళధ్వనులు చేశారు. మూడున్నరేళ్లలో సిద్ధిపేటతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కావాల్సినంత సాగునీరు అందిస్తామని స్థానిక ప్రజలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే సిద్ధిపేట పాత బస్టాండ్ వద్ద తెలంగాణ అమరవీరుల పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు