నేడు, రేపు వడగాడ్పులు

28 Apr, 2019 02:28 IST|Sakshi

అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45 డిగ్రీలు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నింపుల కుంపటిలో మగ్గుతోంది. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం, మంచి ర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో అన్నిచోట్లా తీవ్రమైన ఎండలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, రామగుండం, నల్లగొండల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 43, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల వంతున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు