'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా'

17 Feb, 2015 17:35 IST|Sakshi
'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా'

వరంగల్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. తాను భోళాశంకరుడని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని రాజయ్య తెలిపారు. గత మూడు రోజుల క్రితం కూడా రాజయ్య ఇవే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

 

కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశాని సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు