పోటీకి తిరస్కరించిన కోదండరామ్

12 Mar, 2014 10:07 IST|Sakshi

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జేఏసీకి చెందిన సభ్యులు కూడా పోటీ చేయాలన్న టీఆర్ఎస్ ప్రతిపాదనను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. ఉద్యోగ సంఘాలకే చెందిన శ్రీనివాస గౌడ్ మాత్రం మహబూబ్నగర్ నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాల గురించి చర్చించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తెలంగాణ జేఏసీ ముఖ్యనేతలు బుధవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు.

మరిన్ని వార్తలు