-
టీ జేఏసీ ప్రజా మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రజాకాంక్షలను రాజకీయ పార్టీ ల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తెలంగాణ జాయిం ట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) మెజారిటీ ప్రజల అవసరాలు, ప్రాధాన్యత రంగాలను విశ్లేషించి ప్రజల మేనిఫెస్టోను రూపొందించింది. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనలో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీతోపాటు జిల్లా కమిటీ సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, వివిధ సామాజిక సంస్థలు, ఉపాధి హామీ రేడియో, టీఎస్ ఆర్టీసీ పరిరక్షణ సమితి, విద్యా పరిరక్షణ కమిటీలు భాగస్వాములయ్యారు. దాదాపు 15 ప్రాధాన్యత రంగాల్లోని కీలకాంశాలపై టీజేఏసీ బృం దం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు విశ్లేషణ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు టీజేఏసీ చైర్మన్ కంచర్ల రఘు తెలిపారు. ఈ మేనిఫె స్టోను టీజేఏసీ త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అందించనుంది. ఆయా పార్టీలు వాటిలోని అంశాలను మేనిఫెస్టోల్లో ప్రకటించేలా చర్యలు తీసుకోనుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ వీటి అమలులో తాత్సారం జరిగితే ఉద్యమిం చనున్నట్లు టీజేఏసీ ప్రకటించింది. మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగానే వచ్చే ఐదేళ్లలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. మేధావుల్లో తెలియని భయం కనిపిస్తోంది: ఆర్కైవ్స్ డీజీ మురళి ‘మేధావులు చురుకుగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. కానీ మన సమాజంలోని మేధావుల్లో ఎక్కడో తెలియని భయం కనిపిస్తోంది. దాం తో వారంతా సమస్యలపై గళమెత్తేందుకు ఆలోచిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీనివల్ల వ్యవస్థ సంకటంలో పడుతుంది’ అని రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డా రు. టీ జేఏసీ రూపొందించిన ప్రజల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మేధావులంటే ఉన్నత చదువులు చదివినోళ్లే కాదు. కాస్త చదువుకొని సమాజంపై అవగాహన, విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. వారంతా బయటకు వస్తేనే సమాజంలో మార్పు మొదలవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాలు రూపొందిస్తున్న బడ్జెట్ ఆర్భాటంగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. బడ్జెట్పైన అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతారు. కానీ ఖర్చుపైన మాత్రం పెద్దగా చర్చించరు. ఖర్చు చేసిన నిధులపైనా సుదీర్ఘ చర్చ జరపాల్సిన అవసరం ఉంది’అని సూచించారు. టీ జేఏసీ మేనిఫెస్టోలోని అంశాలు పేదల అభ్యున్నతికి తోడ్పడతాయని, వాటిని అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతానికిపైగా అమలు చేసే కార్యక్రమాలే టీజేఏసీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. పారదర్శకంగా, పద్ధతిగా నిధులు ఖర్చు చేస్తే వాటి ఆచరణ అసాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేలా మేధావులు ప్రయత్నించాలని, జీరో బేస్డ్ ఎలక్షన్స్ జరిగేలా ఉద్యమిం చాలని మురళి సూచించారు. సచివాలయంలో సెక్షన్ అధికారి నుంచి సీఎం వరకు ప్రతి దశలో జరిగే ఫైళ్ల పురోగతిని ప్రజలు తెలుసుకునే వెసులుబాటు కలి గిస్తే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ప్రజల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... వ్యవసాయం: రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు. రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చేలా ఆదాయ కమిషన్ ఏర్పాటు. రైతులకు నెలకు రూ. 18 వేల ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు. మహిళలు: వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మహిళలకు గుర్తింపు కార్డులు. వ్యవసాయ కూలీలు, సాగు చేస్తున్న ఒంటరి మహిళలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లోని మహిళల ఉపాధికి సహకారం. భూ సంస్కరణలు: కొత్త పట్టాదారు పాస్పుస్తకాల చట్టంలో సాగుదారుల కాలమ్ పునరుద్ధరణ. భూమిలేని పేదలకు భూ పంపిణీ. శ్రీశైలం ప్రాజెక్టు సహా వివిధ సాగునీటి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట. నీటిపారుదల: కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పునఃపరిశీలన. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అవసరమైన మార్పులతో పునరుద్ధరణ. విద్యుత్: గృహ, వ్యాపార, చిన్న, కుటీర పరిశ్రమలకు విద్యుత్ చార్జీల తగ్గింపు. 100 యూనిట్ల వరకు ఉచితం, 200 యూనిట్ల వినియోగంపై సగం చార్జీ. రైతులు, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉండే ప్రైవేటు నర్సరీలకు ఉచిత విద్యుత్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ: ఉపాధిహామీ పథకంలో నమోదు చేసుకున్న 51 లక్షల కుటుంబాలకు పక్కాగా 100 రోజుల పనిదినాలు. ఉపాధి కూలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు. సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు. బీసీలకూ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు. దళితులపై దాడుల నివారణ, కుల నిర్మూలన చట్టం ఏర్పాటు. ఆదివాసీలు: ఆదివాసీ ప్రజల ఉనికి, గుర్తింపునకు హామీ. అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం, పెసా చట్టాల పక్కా అమలు. పోడు భూములకు పట్టాల పంపిణీ. విద్య: విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధుల కేటాయింపు. స్కూళ్లలో ఉదయం అల్పాహారం, సాయంత్రం ఉపాహారం. ప్రైవేటు వర్సిటీల బిల్లు రద్దు. వైద్యం: ప్రతి మండలంలో పీహెచ్సీ, నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు. 24/7 పీహెచ్సీల పని వేళలు. అసంఘటిత కార్మిక రంగం: బీడీ కార్మికులకు కనీస వేతనాలు. హమాలీ కూలీలకు సమగ్ర చట్టం. ఆటో, మోటారు వాహన రంగాల్లోని కార్మికుల సంక్షేమం, భద్రతకు చర్యలు. పారిశ్రామిక రంగం: చిన్న, కుటీర, గృహ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. సింగరేణి పరిధిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ రద్దు. మద్య నిషేధం: రాష్ట్రంలో మద్య నిషేధం అమలు. నీరా ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకం. యువజనం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ పూర్తిస్థాయిలో భర్తీ. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్. కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం. చట్టాల అమలు: రాజ్యాంగంతోపాటు ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాల పక్కా అమలు. -
ఆ కారణాలు సహేతుకంగా లేవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జేఏసీ) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించాలనుకున్న అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు చూపిన కారణాల్లో కొన్ని సహేతుకంగా లేవని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ దేశ పౌరులందరికీ నిరసన తెలియచేసే హక్కు ఉందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని గుర్తు చేసింది. యాత్రలో పాల్గొనడానికి వచ్చే వారిని ముందుగానే అరెస్ట్ చేస్తున్న అంశానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. యాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఇతర తేదీల్లో యాత్ర నిర్వహణకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అలాగే తేదీలతోపాటు యాత్ర సందర్భంగా పాటించాల్సిన షరతులను సైతం తామే నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతివ్వాలంటూ ఆగస్టు 29న చేసుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పందించడం లేదని, తాము తలపెట్టిన యాత్రకు అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీజేఏసీ కో–కన్వీనర్ ఐ.గోపాల శర్మ దాఖలు చేసిన పిటిషన్కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. పోలీసులు కావాలనే జాప్యం చేశారు... అంతకుముందు పిటిషన్పై వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో యాత్రకు అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పష్టత కోరారని, ఘర్షణలు, రాజకీయ వైషమ్యాలు చోటుచేసుకోవచ్చంటూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో యాత్రకు అనుమతి నిరాకరించారన్నారు. నెలన్నర కిందట చేసుకున్న దరఖాస్తుపై కావాలనే జాప్యం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులిచ్చారన్నారు. అంతేగాక యాత్రకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని, చౌటుప్పల్ వద్ద పలువురిని అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మీరే రూట్ నిర్ణయించాల్సింది... ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా న్యాయమూర్తి స్పందిస్తూ నిరాకరణ ఉత్తర్వుల ద్వారా పిటిషనర్లకు వాటిని ఆమోదించడం మినహా మరో అవకాశం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం రామచంద్రరావు వాదిస్తూ టీజేఏసీ గతంలోనూ యాత్రలు చేపట్టిందని, కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో షరతులను ఉల్లంఘించడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. టీజేఏసీ నాయకులు రూట్ మ్యాప్ కూడా ఇవ్వలేదని, దీనివల్ల ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ప్రజల ఆస్తులకు జరిగే నష్టం–పౌర హక్కుల మధ్య సమతౌల్యత చూపాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని, ఆ బాధ్యతను తాము సమర్థంగా నిర్వర్తిస్తామన్నారు. పిటిషనర్ రూట్ మ్యాప్ ఇవ్వకుంటే, పోలీసులే యాత్రా మార్గాన్ని నిర్ణయించి ఉండాల్సిందని, అప్పుడు యాత్ర చేసుకోవాలా వద్దా అనే అంశాన్ని పిటిషనరే నిర్ణయించుకొని ఉండేవారని వ్యాఖ్యానించారు. -
నక్సల్స్, కాంగ్రెస్తో కోదండరాం కుమ్మక్కు
స్టేషన్ మహబూబ్నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు. పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోవాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. లేదంటే రెండు తెలుగు ప్రాంతాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో రాజకీయ పబ్బంగడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. శనివారం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కోదండరాం వెనుకబడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వల్ల సీమాంధ్ర రాజకీయనాయకుల గుత్తాధిపత్యం పోయి తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రాంతానికి నష్టం జరుగకపోగా, మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. కేవలం పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక దశాబ్దాలపాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యంకాదని నమ్మి తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు తెలంగాణ వస్తుందని తెలిశాక మాత్రం అనేక సాకులు చూపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కేవలం ఆంధ్రా ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చ గొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, సంఘటిత శక్తి, త్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణపై ద్వేషపూరిత వైఖరే అనేక అంశాలలో విభజన ప్రక్రియ నత్తనడక నడవడానికి, ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి రెండు ప్రాంతాలకూ నష్టం కలుగ జేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణలో కొనసాగుతున్నకొందరు సీమాంధ్ర రాజకీయనాయకుల, పెట్టుబడిదారుల జోక్యాన్ని తాము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన ఉద్యోగ నియామకాల విషయంలో టీజేఏసీ చేయతలపెట్టిన నిరుద్యోగ ప్రదర్శనను భగ్నం చేయడానికి చైర్మన్ ప్రో.కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం హేయమైన చర్య.. అప్రజాస్వామికం.. అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉన్న అయన ఈ విషయమై బుధవారం ఒక ప్రకటన చేస్తూ కోదండరాం అరెస్టును తీవ్రంగా ఖండించారు. నీళ్లు..నిధులు..నియామకాలు అనే అంశాలపైనే తెలంగాణ ఉద్యమం సాగింది.. కాంగ్రెస్ పార్టీ కృషి.. సోనియా గాంధీ పట్టుదలతో తెలంగాణ సాదించుకున్నాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు 33 నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా సాగుతుందని ఆయన అన్నారు. నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేసారని.. నిరుద్యోగులు అంటే కేసీఆర్ భయపడుతున్నారని అయన అన్నారు. అనేక సందర్భాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. తరువాత కొత్త జిల్లాలు వస్తే మరో 30 వేల ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పి ఇపుడు కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. స్వేచ్ఛ లేకుండా.. రాజ్యాంగ రహితంగా అణచివేసే ధోరణిలో పాలిస్తున్న ఈ పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement