తెలంగాణలో త్వరలో ల్యాండ్ సర్వే: మహమూద్ ఆలీ

25 Aug, 2014 18:49 IST|Sakshi
తెలంగాణలో త్వరలో ల్యాండ్ సర్వే: మహమూద్ ఆలీ
నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ల్యాండ్ సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. నల్గొండ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ సర్వే కోసం కేంద్రాన్ని 600 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరాం అని అన్నారు. 
 
తెలంగాణ పది జిల్లాల్లో కరవు జిల్లాలను గుర్తించి.. దాన్ని అడ్డుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
మరిన్ని వార్తలు