తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవ పోస్టర్ను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్ అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్టపై ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకుని, ఆతర్వాత బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.
ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని నరసింహన్ తెలిపారు. టీటీడీలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 వరుసల క్యూలైన్ విధానం బాగుందని నరసింహన్ అన్నారు.