తెలంగాణలో మాఫియా రాజ్యం

2 Aug, 2017 03:57 IST|Sakshi
తెలంగాణలో మాఫియా రాజ్యం
విరసం నేత వరవరరావు
 
పెద్దపల్లి రూరల్‌: తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్య మ సమయంలో ‘నక్సల్స్‌ ఎజెండా యే నా ఎజెండా’ అన్న కేసీఆర్‌ కుర్చీ ఎక్కిన తర్వాత దొరల పోకడకు తెర తీశార న్నారు. నేరెళ్ల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇసుక మాఫియా నిందితుల ఆస్తులను పంచాలన్నారు.

కరీంనగర్‌ జైలులో ఉన్న నేరెళ్ల బాధితులను వరవరరావు పరా మర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.  ఇక్కడి ఇసుక మాఫియా మామూలుది కాదని.. సింగపూర్, మలేషియాలకు ఇసుక రవాణా చేస్తున్న గోల్డ్‌స్టోల్‌ కంపెనీకి చెందిందని, దీనికి కేటీఆర్‌తో సంబంధాలున్నాయన్నారు.
మరిన్ని వార్తలు