పోలీసుల చేతిలో డ్రోన్‌ కెమెరా

23 Nov, 2019 12:23 IST|Sakshi
ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో డ్రోన్‌ కెమెరా

సాక్షి, మహబూబాబాద్‌: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న పోలీసుల చేతికి డ్రోన్‌ కెమెరాలు అందాయి. ఈ మేరకు మహబూబాబాద్‌ జిల్లాకు మంజూరైన డ్రోన్‌ కెమెరాను ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమమానం చేసే వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం ఈ కెమెరాను ఉపయోగిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు