హైదరాబాద్: సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. బుధవారం ఉదయం విజయవాడ- ఖమ్మం మార్గంలో చింతకాని మండలం వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన డ్రైవర్ రైలును నిలిపివేశారు. సంఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుని, మరమ్మతులు ప్రారంభించారు.