అదనంగా మరో 30 విధులు.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, ఆలేరు : గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నూతనంగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64బాధ్యతలను నిర్వహించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018–పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవటంతో పాటు సర్పంచ్కు సబార్డినేట్గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, త్రాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ, మొక్కలు నాటడం, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు వి«ధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ – 6 (8)లో ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది.
24గంటల్లో అనుమతి
భవన నిర్మాణాలకు 24గంటల్లోనే అనుమతినివ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఔట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7రోజుల్లో అనుమతినివ్వాలని ఆదేశించింది. అలాగే లేఔట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఔట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. అలాగే గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పై ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహ రిజిస్టేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలు ఇవే..