బల్కంపేట అమ్మవారి సన్నిధిలో నీత అంబానీ

13 May, 2019 07:37 IST|Sakshi

సనత్‌నగర్‌: రిలయన్స్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ సతీమణి నీతు అంబానీ ఆదివారం సాయంత్రం బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు. ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు సహ అధ్యక్షురాలిగా వ్యహరిస్తున్న ఆమె ఉప్పల్‌స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ని తిలకించేందుకు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నీతు అంబానీ దేవాలయానికి రాగా, అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. నగరానికి ఎప్పుడు వచ్చినా విధిగా ఆమె బల్కం పేట అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ.

మరిన్ని వార్తలు