సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే రూ.1,86,44,340 డబ్బు పట్టుబడింది. దీంతో ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు రూ.9,66,26,006కు చేరింది. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాల సంఖ్య 8,463కు చేరుకోగా, 39 ఆయుధాల లైసెన్స్లను రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ రూ.53 లక్షలకు, ఆభరణాల విలువ రూ.2.66 కోట్లకు చేరింది.