19న రాష్ట్రపతి రాక

4 Dec, 2015 23:56 IST|Sakshi
19న రాష్ట్రపతి రాక

బొల్లారం: ఈ నెల 19న నిర్వహించనున్న తమ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారని ఎంసీఈఎంఈ ఇంజినీరింగ్ కళాశాలల లె ఫ్ట్‌నెంట్ జనరల్ గురుముఖ్‌సింగ్ వెల్లడించారు. 1946లో ప్రారంభమైన ఈ కళాశాల సాంకేతిక శిక్షణతో ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిందన్నారు. దీంతో కళాశాలకు ఐఎస్‌ఓ 9001 సర్టిఫికెట్‌తో పాటు  పాటు ప్రధానమంత్రి అవార్డు లభించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌తో పాటు ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు