23 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

6 Jul, 2015 13:52 IST|Sakshi

బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగుగ్యాల గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి ఎస్‌ఐ రాజు సోమవారం మధ్యాహ్నం తాళ్లగుగ్యాల గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ వ్యాన్‌లో తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం ఎక్కడినుంచి తరలిస్తున్నారో చెప్పకపోవడం, రసీదు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు