రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ..

26 Mar, 2015 13:38 IST|Sakshi
రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ..

మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) శిరీషను ఓ దుండగుడు రివాల్వర్తో బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు జరిగి... ఆమె వద్ద నుంచి లక్షా 50వేలు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన వనపర్తి మండలం ఖాసింనగర్లో చేటుచేసుకుంది.

గోపాలపట్నం మండలం జైళ్ల తిరుమలాపురానికి చెందిన బీపీఎం శిరీష మరో యువకుడితో కలసి బైక్‌పై వెళుతుండగా వనపర్తి మండలం కాశీనగర్ దగ్గర ఓ వ్యక్తి రివాల్వర్‌తో బెదిరించి 1.50లక్షల నగదు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు