సదాశివనగర్(ఎల్లారెడ్డి): జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాలుగు రాష్ట్రల్లో ఓట్లలో నాలుగు శాతం ఓట్లు సాధించగలిగితే ఆ పార్టీని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతంలో నాలుగు శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తోంది. పార్టీలో సిద్ధాంత రీత్యా గాని, వ్యక్తుల వల్ల గాని పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.
జాతీయ పార్టీలు..
దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు.
రిజిస్టర్స్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు..
ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్ అన్ రిక్నగ్నైజ్డ్ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేసుకుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒకవేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తారు. వారికి ఇండిపెండెంట్ అభ్యర్థుల కన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు రాష్ట్రంలో 73 వరకు ఉన్నాయి. ఫ్రీ సింబల్స్గా 164 సిద్ధంగా ఉంచుతారు.
జాతీయ పార్టీలు
1. తృణమూల్ కాంగ్రెస్
2. బహుజన సమాజ్పార్టీ
3. బీజేపీ
4. సీపీఐ
5. సీపీఐ(ఎం)
6. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7. నేషనలిస్ట్ కాంగ్రెస్
ప్రాంతీయ పార్టీలు..
1. ఎంఐఎం(పతంగి గుర్తు)
2. టీఆర్ఎస్(కారు గుర్తు)
3. వైఎస్సార్సీపీ (సీలింగ్ ఫ్యాన్ గుర్తు)
4. టీడీపీ (సైకిల్ గుర్తు)