ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో మంగళవారం అధికారులు ప్రాథమిక సర్వే నిర్వహించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
గ్రామస్తుల జీవన స్థితిగతులను అంచనావేయడం కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 26న దత్తన్న కొలనుపాకకు రానున్నారని ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.