బైక్‌ను ఢీకొట్టిన టాటా ఏస్‌.. ఒకరి మృతి

14 Oct, 2017 09:23 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని రామడుగు మండలం వెదిర వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న పల్సర్‌ బైక్‌ను ఢీకొట్టింది.

ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు