రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

26 May, 2018 03:30 IST|Sakshi
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరుగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో జోన్ల విధానంపై చర్చించనున్నారు. కొత్తగా ఏర్పాటుచేయనున్న జోన్లు, మల్టీ జోన్లపై మార్పులు చేర్పులు, రైతులకు అమలుచేయనున్న జీవితబీమా పథకంపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.   

మరిన్ని వార్తలు