ఉరేసుకుని అన్నదాత ఆత్మహత్య

16 Feb, 2016 18:15 IST|Sakshi

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు బాలయ్య (56) రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చేందుకు బోరు వేశాడు. అనుకున్నంతగా నీళ్లు పడకపోవడంతో వేసిన పంటలు చేతికందలేదు. దీంతో రూ.1.6 లక్షల అప్పులు మాత్రం మిగిలాయి.

ఈ క్రమంలో కూలి పనులకు వెళ్తున్నాడు. మరోపక్క గతంలో చేసిన అప్పులు తీర్చకపోవడంతో.. రెండో కుమారుడి పెళ్లి ఖర్చులకు సైతం ఎవరూ అప్పు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాలయ్య మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రకు ఉపక్రమించిన బాలయ్య... కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్న తర్వాత పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం వెలుగు చూసింది.

 

మరిన్ని వార్తలు