సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను 10న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 872 పరీక్ష కేంద్రాల్లో గత నెల 15 నుంచి 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో ఫస్టియర్కు సంబంధించి 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు.