-

ప్రభుత్వ స్కూళ్ల మూసివేతపై నిరసన

25 May, 2015 12:07 IST|Sakshi

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి(టీవీపీఎస్) ఆందోళనకు దిగింది. టీవీపీఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పలువురు సభ్యులు ధర్నాకు దిగారు. పభుత్వ స్కూళ్లను ప్రభుత్వం పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్కూళ్ల రేషనలైజేషన్ విషయంలో మెండిగా ముందుకు వెళితే ఆందోళన ఉధృతం చేస్తామని టీవీపీఎస్ తెలిపింది.

మరిన్ని వార్తలు