కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

17 Aug, 2015 09:21 IST|Sakshi

కందుకూర్ : రంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మందా గీత(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే గీత ఆత్మహత్య చేసుకుందని తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు