రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనలో మరో ఇద్దరు మరణించారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది.
మంగళవారం ఉదయం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 29 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్రగాయాల పాలయ్యారు. మృతులు విశాఖ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరికి చెందినవారి తెలుస్తోంది. గాయపడిన వారిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించారు.