వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఏసీబీ నోటీసు

14 Jul, 2015 19:54 IST|Sakshi

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరొకరికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్కు నోటీసులు జారీ చేశారు.

బుధవారం ఉదయం 10 గంటలలోగా విచారణకు హాజరు కావాలని కృష్ణను ఆదేశించారు. ఈ కేసులో ఫోన్ కాల్ లిస్టులో కృష్ణ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో కేసు విచారణలో మరిన్ని వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు కృష్ణను విచారించనున్నారు. ఏసీబీ అధికారులు కృష్ణను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏసీబీ అధికారులు ఇదివరకే వేం నరేందర్ రెడ్డిని విచారించారు.

మరిన్ని వార్తలు