హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి, ఆ మొత్తాన్ని డిపాజిట్ దారులకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
అఫిడవిట్ దాఖలు చేస్తే ఆస్తులు అమ్మేందుకు అనుమతిస్తామని హైకోర్టు అగ్రిగోల్డ్కు సూచించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.