భుజం గాయంతో బాధపడుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్లో ఆడలేకపోతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు కోహ్లికి నాయకత్వం వహిస్తున్నాడు. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఐపీఎల్లో ఆడాలని కోహ్లి భావిస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులో కోలుకుంటున్న కోహ్లిని ఇటీవల ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పరామర్శించారు.
బెంగళూరుకు వచ్చిన కోహ్లిని అనుష్క కలుసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. రానున్న ఐపీఎల్ మ్యాచ్లో ఆడేందుకు సిద్ధమవుతున్న కోహ్లిని ఉత్సాహపరచడానికి అనుష్క వచ్చినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్కు దాదాపు అనుష్క హాజరయ్యేది. కానీ, ఆమె వస్తుండటం వల్లే కోహ్లి బాగా ఆడటం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు చెలరేగిపోయి కించపరుస్తుండటంతో మ్యాచ్లకు అనుష్క దూరంగా ఉంటోంది.