అశోక్ లేలాండ్ ఎండీగా వినోద్ కె దాసరి

27 May, 2016 00:41 IST|Sakshi
అశోక్ లేలాండ్ ఎండీగా వినోద్ కె దాసరి

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ ఎండీగా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్‌ఈకి నివేదించింది. అంటే ఈయన 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు అశోక్ లేలాండ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు