కాంగ్రెస్ను ప్రజలు ఇష్టపడటం లేదు:అమర్త్యసేన్

20 Dec, 2013 18:51 IST|Sakshi
కాంగ్రెస్ను ప్రజలు ఇష్టపడటం లేదు:అమర్త్యసేన్

కోల్కతా: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపించిందని, ప్రజలు ఆశించిదాన్ని ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఇష్టపడటం లేదనే విషయం ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో  స్పష్టంగా కనబడిందన్నారు. ఈ మేరకు ఆయన నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ధృఢమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ నాయకుడి ఎవరు అనే దానిపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేదన్నారు. ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించాలంటే నాయకుడిపై పార్టీ వైఖరిని  తెలియాజేయాలన్నారు. అలా చెప్పకపోతే రాజకీయంగా కాంగ్రెస్ నుంచి సరైన పోటీ ఉండదన్నారు.

మరిన్ని వార్తలు