ప్రచారం కోసమే రూ. 526 కోట్లా?

3 Jul, 2015 09:26 IST|Sakshi
అజయ్‌మాకెన్(ఫైల్)

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రచారం కోసం రూ. 526 కోట్లు కేటాయించటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

సమాచారం, ప్రచారం కోసం గత ఏడాది కేవలం రూ. 24 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఏకంగా రూ. 526 కోట్లు కేటాయించటం ఏమిటని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్ బీజేపీ నేత విజేందర్‌గుప్తా, ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు