విజయవాడ : తాను తీసే సినిమాలలో సామాన్యుడే హీరో అని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. తన సినిమాల్లోకి జనాల్లో నుంచే హీరోని తీసుకుంటానన్నారు. అంతకుముందు శుక్రవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలోని కనక దుర్గమ్మని ఆయన దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత ఆయనకు ఆలయ పూజార్లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తేజ దర్శకత్వంలో వచ్చిన పలు టాలీవుడ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు మధ్య డాష్ డాష్ చిత్రం ప్లాప్ అయిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత హోరాహోరీ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల అయింది.