-

కాక్ పిట్లో తన్నుకున్నారు ...

17 Jan, 2015 12:15 IST|Sakshi
కాక్ పిట్లో తన్నుకున్నారు ...

చెన్నై :  చెన్నై- ప్యారిస్ ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్లో ఇంజినీర్పై పైలట్ దాడి చేశారు. దాంతో ఆ ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంజినీర్ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పైలట్ను ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం చెన్నై ఎయిర్ పోర్ట్లో చోటు చేసుకుంది.

ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసిన వైనం మాత్రం తెలియరాలేదు. పైలట్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంజినీర్పై దాడికి నిరసనగా ఎయిర్ ఇండియా ఇంజినీర్లు ఎయిర్పోర్ట్ లో ఆందోళనకు దిగారు. దాంతో చెన్నై - ప్యారిస్ విమానం బయలుదేరకుండా ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంజినీర్ పై పైలట్ దాడిపై విచారణకు ఎయిర్ ఇండియా ఆదేశించింది. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. 

మరిన్ని వార్తలు