హ్యుందాయ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్

18 Dec, 2013 01:37 IST|Sakshi

న్యూఢిల్లీ: హ్యుందాయ్ కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్ని మోడళ్లళ కార్ల ధరలను జవనరి నుంచి రూ.5,000-రూ.20,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలు పెంచుతున్నామని వివరించారు. ఇప్పటికే మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, హోండా తదితర కంపెనీలు ధరలను పెంచాయి.

>
మరిన్ని వార్తలు