న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో కొత్త మోడల్... ఎక్సెంట్ను మంగళవారం ఆవిష్కరించింది. వచ్చే నెలలో ఈ కారును మార్కెట్లోకి తేనున్నది. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో భారత మార్కెట్ కోసం ఈ ఎక్సెంట్ మోడల్ను అందిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా ఎండీ, సీఈవో బి.ఎస్. సియో చెప్పారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ప్రత్యేకతలు..: రియర్ ఏసీ వెంట్స్, కీలెస్ ఎంట్రీ, బటన్ స్టార్ట్, 15 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఆటో ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ టెలిఫోనీ, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్, యూఎస్బీతో కూడిన 2డిన్ ఆడియో, 1జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉన్న సీడీ ప్లేయర్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.