జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

11 Sep, 2015 09:22 IST|Sakshi
జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం గురువారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో... టైర్ పేలింది. అయితే సీఎం రఘుబర్ దాస్తోపాటు 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోఎయిర్వేస్ విమానం ఢిల్లీ నుంచి రాంచీ విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
 

మరిన్ని వార్తలు