రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం

3 Sep, 2015 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్... రైల్లో చోరీ బారిన పడ్డారు. గ్వాలియర్ నగరానికి చెందిన సురేఖా సక్సేనా.. ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఎంపిక కావడంతో ఆ అవార్డు తీసుకునేందుకు తన సోదరుడు సురేందర్ సక్సేనాతో కలసి సమతా ఎక్స్ ప్రెస్ ఏసీ టూ టైర్ రైలులో బయలుదేరారు.

రైలు మధుర స్టేషన్లో ఆగగానే చాయ్ అంటూ వచ్చిన ఓ వ్యక్తి వారికి చాయ్ పోసినట్లుగా పోసి సడెన్గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై ప్రయోగించారు. వారు అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈలోపే అతడు పారిపోయాడు. అనంతరం చూసుకున్న వారికి ఆమె పర్సు, సోదరుడి గోల్డ్ వాచ్ పోయినట్లు తెలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు