'వారి చర్యలు రాజకీయ ప్రేరేపితం'

15 Oct, 2015 16:52 IST|Sakshi

దేశంలో రచయితలు, మేధావులు తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తున్న చర్యలను రాజకీయ ప్రేరేపిత చర్యలుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ కే.ఎన్.త్రిపాఠి అభివర్ణించారు. సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన తరువాత దేశంలో ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు స్పందించని వీరంతా హఠాత్తుగా మేల్కొనడం వెనుక రాజకీయ శక్తుల హస్తం ఉందన్నారు.
 

హేతువాద రచయిత నరేంద్ర దబోల్కర్, వామపక్ష వాది నరేంద్ర దబోల్కర్, ప్రముఖ పండితుడు కాల్బుర్గీల హత్యలతో మతవాదులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వినతి చేస్తూ పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు రచయితలు నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ .త్రిపాఠి ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు