'సమాజ్వాది పార్టీతో చేతులు కలపండి'

6 Nov, 2014 20:07 IST|Sakshi

లక్నో: లోక్సభ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తి చిదంబరం హైకమాండ్ ను ధిక్కరించే విధంగా మాట్లాడి 24 గంటలు గడవకముందే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు గళం విప్పారు.

బీజేపీ వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీని బలోపేతం చేయాలని ఉత్తరప్రదేశ్ లోని బంద నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ కుమార్ సింగ్ ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎస్ఎంఎస్ పంపించారు. పార్టీని బలోపేతం చేయండి లేదా మతతత్వ శక్తులతో పోరాటం చేయడానికి యూపీలో అధికారంలో ఉన్న సమాజ్వాది పార్టీతో చేతులు కలపాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు