భోపాల్: ఓ ఆరెస్సెస్ ప్రచారక్పై దాడి అంశం మధ్యప్రదేశ్లో దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో బాలాఘాట్ ఐజీ డీసీ సాగర్, ఎస్పీ అసిత్ యాదవ్పై శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం వేటువేసింది. వారి స్థానంలో బాలాఘాట్ ఐజీగా జీ జనార్దన్ను, ఎస్పీగా అమిత్ సంఘీని నియమించింది.
ఆరెస్సెస్ ప్రచారక్ సురేశ్ యాదవ్పై చర్య తీసుకున్నందుకుగాను పోలీసు అధికారులపై ఈ విధంగా వేటు వేయడం మధ్యప్రదేశ్ పోలీసులలో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. బదిలీకి గురైన పోలీసులకు వారు మౌనంగా సంఘీభావం తెలుపుతున్నారు. ఓ వాట్సప్ పోస్టు విషయంలో సురేశ్ యాదవ్ను ఏఎస్పీ రాజేశ్ శర్మ, ఎస్సై జియా హుల్ హక్ అరెస్టు చేశారు. అయితే, అరెస్టు సందర్భంగా సురేశ్ను పోలీసులు చితకబాదినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గ్వాలియర్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ దాడి అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై వేటుపడటం మధ్యప్రదేశ్లో చర్చనీయాంశమైంది.