సినీ చరిత్రలోనే అరుదైన కాబినేషన్ ఇది. అక్కినేని అభిమానులకేకాదు యావత్ సినీ ప్రేమికులను సైతం ఆశ్చర్యానికి గురిచేసేలా మామకోడళ్లైన తర్వాత.. అక్కినేని నాగార్జున, సమంతలు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత.. మామగారి సినిమాతో మళ్లీ సత్తాచాటుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘రాజుగారిగది-2’లో సమంత ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘మనం’ సినిమా తమ నిజజీవితాలకు అతి దగ్గరగా ఉంటుందని హీరో నాగార్జున తరచూ అంటుంటారు. తాజాగా తన ‘ఓం నమో వెంకటేశాయ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనూ నాగ్ మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేయడం తెలిసిందే. మనంలో నాగార్జున(నాగేశ్వరరావు) తల్లిగా నటించిన సమంత.. నిజజీవితంలో కోడలు(నాగచైతన్య భార్య) కానుంది. గతవారమే సమంత-చైతూల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఒప్పుకున్న మొదటిసినిమా ‘రాజుగారి గది-2’ అంటూ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
‘రాజుగారిగది’కి సీక్వెల్గా రూపొందుతున్న ‘రాజుగారిగది-2’లో నాగార్జున లీడ్రోల్ అని వెల్లైడనప్పటినుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పి.వి.పి, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా, రాజుగారిగది-2లో నాగార్జున, సమంత పాత్రల మధ్య సంబంధం ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!
Exclusive. #Samantha on board #RajuGariGadhi2. It's the first project she signed since her engagement. Also stars her future FIL #Nagarjuna pic.twitter.com/gfouB5W5td
— Haricharan Pudipeddi (@pudiharicharan) 3 February 2017